________________
నేను ఎవరిని ?
8
స్థిరంగా వుంటుంది.
కానీ లక్ష్యం చలిస్తూ అపుడపుడు స్వల్పకాలం పాటు పోతుంది. మనం పరధ్యానంగా ఉన్నపుడు లేదా మన పనులలో మునిగిపోయినపుడు ఆ పరిమిత కాలంలో మనం జాగృతిని కోల్పోవచ్చు కానీ ఏ క్షణం మనం మన పనులనుంచి విరామం పొందుతామో ఆక్షణం అది తిరిగి వస్తుంది.
లౌకిక వ్యవహారాలనుంచి, బాధ్యతలనుంచి విడుదలై ఏకాంతంలో కూర్చున్నపుడు పొందే అనుభవమే ఆత్మానుభూతి. ఈ అనుభవం క్రమక్రమంగా వృద్ధిపొందుతుంది. అందువల్ల ఇదివరకటి చందులాల్ కి ఇప్పటి చందూలాల్ కి ఉన్న తేడాను ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు. ఈ మార్పుని ఎవరు తీసికొచ్చారు? ఆత్మానుభూతే దీనికి కారణం. ఇంతకు ముందు మీరు దేహాధ్యాసలో (భౌతిక దేహక్రియలు, దాని యొక్క ఉద్రిక్త స్వభావం మాత్రమే ఎరిగిన స్థితి) ఉండేవారు,
కానీ యిప్పుడో ఆత్మలో స్థిరపర్చబడ్డారు. ప్రశ్నకర్త : ఆత్మానుభూతి వల్ల ఏమి జరుగుతుంది? దాదాశ్రీ : ఆత్మానుభూతి కలగటం వల్ల దేహాధ్యాస (దేహమే నేను అనే భ్రమ) తొలగిపోతుంది. ఎపుడు దేహాధ్యాస పోతుందో అపుడు కొత్త కర్మలు నిన్ను బంధించటం ఆగిపోతుంది. ఇంతకంటే నీ కేమి కావాలి?
ప్రశ్నకర్త : నాకు ఈ జ్ఞానమార్గాన్ని చూపవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను. దాదాశ్రీ : అవును. నీకు ఈ మార్గాన్ని చూపిస్తాను. నేను నీకీ మార్గాన్ని చూపటం మాత్రమే కాక నీ ఆత్మను నీ చేతుల్లో కూడ పెడతాను.
ప్రశ్నకర్త : అయితే నా మానవజన్మకి పరమార్ధం చేకూరినట్లే. ఇంతకంటే నాకు కావలసినదేమున్నది?
దాదా శ్రీ : అవును. పూర్తిగా నెరవేరుతుంది. అనంత జన్మలలో స్వప్రయత్నంతో నీవు పొందలేని దానిని నేను ఒకే ఒక గంటలో నీకు ప్రసాదిస్తాను. అపుడొక మనిషిగా నీ లక్ష్యాన్ని సాధించినట్లు నీవు గ్రహిస్తావు. వేయి జన్మల కఠిన పరిశ్రమతో కూడ దీనిని నీవు సాధించలేవు.