________________
జరిగింది న్యాజీరి
లౌకిక దృష్టిలో న్యాయం, ప్రకృతిన్యాయం వేరువేరుగా వుంటాయి. ప్రకృతి న్యాయం గత జన్మలో మనం చేసిన కర్మల ఖాతా మీద ఆధారపడివుంటుంది. ఆ ఫలమే ఇపుడు మనకి లభిస్తుంది. కాని ప్రజలు తమ దృష్టికోణం నుంచి చూసి, తమ అభిప్రాయమే న్యాయమన్న భావనతో కోర్టును ఆశ్రయించి తిరిగి తిరిగి అలసిపోతారు. లభించే ఫలం అదే చివరకు. మనం ఒకరిని అవమానిస్తే వాళ్లు కోపంతో ఉద్రేకంతో అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మనల్ని అవమానిస్తారు. మనం దానిని అన్యాయంగా భావిస్తాం. ఎందుకంటే మనం ఒకటే తిట్టాం. కాని అతను మనల్ని పది తిట్టాడు. కాని మన గత జన్మ ఖాతా ఈ విధంగా బాలెన్స్ అయిందని, జరిగింది న్యాయమని గ్రహించాలి. మీరు ఒక స్నేహితుని తండ్రికి కొంత ధనం అప్పుగా యిచ్చారనుకోండి. ఆ మొత్తాన్ని మీ స్నేహితుని నుంచి వసూలు చేయకుండా ఉంటారా అవకాశం ఉంటే? మీ స్నేహితుడు దానిని అన్యాయంగా భావిస్తే భావించవచ్చు. అలాగే ప్రకృతి కూడ. గత(జన్మల) ఖాతా యొక్క పూర్తి ఆధారాలతో ప్రకృతి న్యాయమే చేస్తుంది.
ఒక భార్య భర్తను వేధిస్తూ ఉందనుకోండి అయినప్పటికీ ప్రకృతి న్యాయమే. భార్యమంచిది కాదని భర్త భావించవచ్చుగాక!. భర్త మంచివాడు కాదని భార్య భావించెను గాక! కాని వర్తమానంలో పరిస్థితి అంతా ప్రకృతి న్యాయమే.
దాదాశ్రీ : నీవు ఏదైనా ఫిర్యాదుతో నా దగ్గరకి వచ్చావనుకో. నీ ఫిర్యాదును నేను వినను. దానికి కారణం ఏమిటి? ప్రశ్నకర్త : ఇపుడు అర్ధమైంది ఎందుకంటే జరిగిందే న్యాయం కనుక.
చిక్కులను వరిష్కరిస్తుంది ప్రకృతి దాదాత్రీ : “బాధపడేవానిదే తప్పు”, “ఎవరితోనూ ఘర్షణ పడవద్దు”, “ఎక్కడైనా సర్దుకొనిపోవాలి”, “జరిగిందే న్యాయం” ఇవన్నీ నా అన్వేషణలు. ఈ అన్వేషణ ఎంతో అద్భుతమైనది కదా!
ప్రకృతి నియమం ఏమంటే ఏ విధంగా దారం చుట్టబడిందో అదే మార్గంలో వెనక్కు తిప్పి ఆ దారాన్ని వేరుచేయటం. అన్యాయానికి అన్యాయమే పరిష్కారం. న్యాయానికి న్యాయమే పరిష్కారం. చేసే పని అన్యాయమార్గంలో చేసి