________________
జరిగింది న్యాజీరి
మర్చిపోయాడు. వర్తకుని వద్ద చాలా వందనోట్లు వున్నాయి. చాలా పదిరూపాయల నోట్లు ఉన్నాయి. అపుడు నువ్వు ఏమిచేస్తావు? “నేను నీకు వందనోటు యిచ్చాను.
ఇంకా తొంభై రూపాయలు నాకు రావాలి” అని అడుగుతావు. అతను 'లేదు నాకు నువ్వు పదిరూపాయల నోటే యిచ్చావు' అంటాడు. అతను అబద్ధం చెప్పలేదు. అతనికి అలాగే గుర్తు వుంది. అపుడు ఏం చేస్తావ్?
ప్రశ్నకర్త : మనసులో అంతడబ్బు పోయిందే అని బాధ ఉంటుంది కదా! అది విచలితమౌతుంది.
దాదాశ్రీ : బాధపడేది మనస్సు, దానికి నిద్రరాదు. నీ నిజస్వరూపానికి దానితో ఏమిపని? నీలోపల ఉన్న లోభబుద్దిగల మనస్సు బాధపడుంది.
అందువల్లనే దానికి నిద్రరాదు. అపుడు దానికి ఇలా చెప్పాలి. “నిన్ను నష్టం బాధించినా నువ్వు నిద్రపోవాలి.” అపుడు రాత్రంతా అది నిద్రపోతుంది.
ప్రశ్నకర్త : అతనికి డబ్బులు పోయాయి? నిద్రా చెడింది కదా!
దాదాశ్రీ : అవును. అందుకే “జరిగిందే న్యాయం” అన్న జ్ఞానం అనుభవంలోకి వస్తే మనకి సుఖము, శాంతి దొరుకుతాయి. దీనిని (జరిగిందే న్యాయం) అర్ధంచేసికొని, అంగీకరిస్తే సంసారసాగరాన్ని సులభంగా దాటవచ్చు. ప్రపంచంలో ఒక్క సెకనుకాలం కూడ అన్యాయం అనేది జరగనే జరగదు. న్యాయం మాత్రమే జరుగుతుంది సదా! కాని “ఇది ఎలా న్యాయం”? అని ప్రకృతి న్యాయాన్ని బుద్ధి ప్రశ్నిస్తుంది. దానితో సమస్యలు మొదలౌతాయి. బుద్ధిపరిధి చాలా చిన్నది. బుద్ధిని అతిక్రమించాలి, లేకుంటే బంధాల్లో చిక్కుకొంటాం. ఒక్కసారి ప్రకృతి నియమాన్ని మనం అర్ధంచేసికొంటే, బుద్ధిచెప్పే దానిని మనం పట్టించుకోం. చట్టం పరిధిలో పొరపాట్లు జరగవచ్చు కానీ ప్రకృతి న్యాయంలో అలాంటి అవకాశమే లేదు. బుద్ధి నుంచి మనం వేరుగా ఉండడం నేర్చుకోవాలి. మన పాతఖాతా బాలెన్స్ ఏదో ఉండి ఉంటుంది అది ఈ విధంగా సెటిల్ అయింది అని గ్రహించాలి.
ఆస్తి వంవకంలో అనమానత - అదే న్యాయం
తండ్రి మరణానంతరం, ఆయన నల్గురు కుమారుల మధ్య భూమి