________________
జరిగింది న్యాజీరి
పంపకంలో వివాదంతలెత్తింది. తండ్రి తదనంతరం ఆస్తి పెద్దకుమారుని హస్తగతం అయింది. అతను ఆస్తిని పంచటానికి యిష్టపడలేదు. నల్గురు అన్నదమ్ములకు ఆస్తిపంపకం సమానంగా జరగాలి. అలా జరిగితే ఒక్కొక్కరికి 50 ఎకరాల భూమి వస్తుంది. అలా జరగలేదు. ఒకరికి 25 ఎకరాలు, ఇంకొకరికి 50 ఎకరాలు, మరొకరికి 40 ఎకరాలు, మిగిలిన వానికి 5 ఎకరాలు మాత్రమే వచ్చింది.
అపుడు ఎవరైనా ఏమనుకొంటారు? లోకులు ఏమంటారు? పెద్దవాడు మోసగాడు, దగాకోరు అంటారు. అది లౌకిక న్యాయం. కాని ప్రకృతి న్యాయం ఏమంటే ఏమి జరిగితే అదే కరెక్ట్. వారికి నిర్ణయించబడిన ప్రకారం వారికి లభించింది. వారు వాస్తవంగా పొందిన భూమికి, తండ్రి ఇచ్చ మేరకు పొందవలసిన దానికి మధ్య ఉన్నభేదం వారి గత జన్మల ఖాతాలో జమ అయిందన్నమాట.
వివాదం వద్దనుకుంటే ప్రకృతి న్యాయాన్ని అనుసరించి నడచుకోవాలి. లేకుంటే ప్రపంచం అంతా జగడాలతో నిండిపోతుంది. న్యాయంకోసం వెదకవద్దు. జరిగిందే న్యాయం. నీ అంతరంగంలో ఏమైనా మార్పు వచ్చిందా? దానిని గమనించుకోవటమే న్యాయం. ' నేను న్యాయంగానే ఉన్నాను. నాకు న్యాయమే లభిస్తుంది' అని నిశ్చయించుకో. న్యాయం ఒక ధర్మామీటరు. ప్రకృతి న్యాయంతో మనిషి ఏకీభవిస్తే అపుడు అతడు పరిపూర్ణుడౌతాడు. అపుడు అతనికి అంతా న్యాయస్వరూపంగానే కన్పిస్తుంది. ప్రకృతి న్యాయంతో ఏకీభవించనంతవరకు అతడు సహజతకు దూరంగానే ఉంటాడు. శాంతి లభించదు. బిలో నార్మల్ లేక అబౌవ్ నార్మాలిటిలో ఉంటారు..
పెద్దకుమారుడు చిన్న కుమారునికి 5 ఎకరాలే ఇచ్చాడు, పూర్తివాటా యివ్వలేదు, అపుడు పెద్ద అతనిని దోషిగా ఆరోపిస్తూ న్యాయం కోసం వెళ్తారు. ఇదంతా తప్పు. ప్రజలు మిధ్యా జగత్తులో జీవిస్తూ మిధ్యనే సత్యమని భావిస్తారు.
భ్రాంతిని సత్యమని భావిస్తే దెబ్బతింటారు. ప్రకృతి న్యాయంలో ఎపుడూ దోషం ఉండదు. ఇటువంటి విషయాలలో నేను జోక్యం చేసికోను. అలా చేయాలి, ఇలా చేయకూడదు అని నేను చెప్పను. అలా చెప్తే నేను వీతరాగ్ అనిపించుకోను. వాళ్ళ పాతఖాతాలు ఏమిటి అని గమనించటం మాత్రమే చేస్తాను.
ఎవరైనా నా దగ్గరికి న్యాయం చెప్పమని వస్తే, నా న్యాయం ప్రపంచ