________________
జరిగింది న్యాజీరి
ప్రశ్నకర్త : లోకం అతని మరణానికి డ్రైవరే కారణం అంటుంది.
దాదాశ్రీ : అవును, రోడ్ కి రాంగ్ సైడు నుంచి వచ్చి చంపేశాడు కనుక. ఒకవేళ రైట్ సైడ్ నుంచి వచ్చినా ఆ యాక్సిడెంట్ జరిగితే అపుడు కూడ
డ్రైవర్ దే తప్పు. కాని యిక్కడ రాంగ్ సైడులో వచ్చి చంపేశాడు కనుక అతనిది రెట్టింపు దోషం. ఒకటి రాంగ్ సైడ్ లో రావటం, రెండవది యాక్సిడెంట్ చేయటం. కాని ప్రకృతి దృష్టిలో అదీ న్యాయమే. ప్రజలు గొడవ చేసినా అది నిష్ఫలమే. గతంలోని ఖాతా ఇపుడు సెటిల్ అయింది. కాని దానిని ఎవరూ అర్ధం చేసికోరు. న్యాయపోరాటంలో తమ విలువైన జీవితాన్ని, డబ్బుని లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి వ్యర్ధం చేసికొంటారు. ఈ వ్యవహారంలో అపుడపుడు లాయర్ల చేత నానా చివాట్లు కూడ తింటారు. దీనికంటె దాదా వివరించిన ప్రకృతి న్యాయాన్ని ప్రజలు అర్ధం చేసికొంటే చాలా తేలికగా సమస్యల నుంచి బయటపడతారు.
వ్యవహారాన్ని కోర్టుకి తీసికెళ్ళడంలో తప్పులేదు. కాని ప్రతిపాదితో సత్సంబంధం కల్గి ఉండాలి. కోర్టులో అతనితో కల్సి టీ త్రాగాలి. మిగిలిన వ్యవహారాలన్నీ ఎప్పటిలానే ఉండాలి. అతను టీ త్రాగనని చెప్తే "పోనీ ప్రక్కన కూర్చో”మని చెప్పాలి. అతని పట్ల నీ ప్రేమ ఎప్పటిలాగే వుండాలి.
ప్రశ్నకర్త : అటువంటి వారు మన పట్ల విశ్వాసఘాతంగా ప్రవర్తించే
అవకాశం
ఉంది కదా!
దాదాశ్రీ : ఎవరూ ఏమీ చేయలేరు, అలా చేయగల మనుష్యులు కూడ లేరు. మనం పవిత్రంగా ఉన్నంతవరకు ఎవరూ హాని చేయలేరు. ఇది ప్రకృతి నియమం. అందువల్ల నీ పొరపాట్లు చక్కదిద్దుకో.
క్రోధాన్ని జయించిన వాడే విజేత నీవు ప్రపంచంలో న్యాయం కోసం వెదుక ప్రయత్నిస్తున్నావా? ఏమి జరిగినా అది న్యాయమే. నిన్ను ఎవరైనా ఒక చెంపదెబ్బకొడితే అది న్యాయమే. ఎపుడు ఈ విధంగా నువ్వు అర్ధం చేసికోగలవో అపుడు అన్ని సమస్యలను పరిష్కరించుకోగలవు.
'ఏమి జరిగితే అదేన్యాయం' అని నీకునువ్వు చెప్పుకోకపోతే, నీ బుద్ధి చాలా రెస్ట్ గా తయారవుతుంది. అనంత జన్మల నుంచి అయోమయాన్ని,