________________
20
జరిగింది న్యాజీరి ఎవరిదోషమూ లేదు. నీ సొమ్ము నీకు యిచ్చినా అందులో మెహర్బానీ కూడ లేదు. ఈ జగత్తు పూర్తిగా ఒక ప్రత్యేక పద్ధతిలో నడపబడుతుంది.
వ్యవహారంలోనే దు:ఖానికి మూలం ఉంది.
న్యాయం కోసం ప్రాకులాడటం వల్లనే మనిషి అలసటకు గురవుతున్నాడు. “నేను వీరికి ఏమి అపకారం చేశాను? నా దోషం ఏమిటి? వీరెందుకు నా పట్ల యిలా ప్రవర్తిస్తున్నారు? నాదారికెంద్కు అడ్డు వస్తున్నారు?” అని మనిషి ఆలోచిస్తాడు.
ప్రశ్నకర్త : ఒక్కోసారి మనం ఎవరి విషయంలోనూ జోక్యం చేసికోకున్నా కనీసం వారి ప్రస్తావన కూడ తేకున్నా మన పట్ల శత్రువుల్లా వ్యవహరిస్తారెందుకు?
దాదాశ్రీ : అందుకే ఈ కోర్టులు, లాయర్లు అన్నీ నడుస్తున్నాయి. అటువంటివి ఏమీ లేకపోతే కోర్టులు ఎలానడుస్తాయి? లాయర్లకు క్లయింట్స్ కూడ ఉండరు. లాయర్లు ఎంత పుణ్యశాలురో చూడండి. తెల్లవారేసరికి క్లయింట్స్ లాయరు యింటికి వచ్చి ఆయన దర్శనం కోసం పడిగాపులు కాసి మరీ డబ్బు యిచ్చి వెళ్తారు. సలహా యిచ్చినంద్కు ఫోనులో మాట్లాడినంద్కు ప్రతి దానికీ ఫీజు వసూలు చేస్తారు. అది వారు తమ పుణ్యఫలాన్ని అనుభవించటం కాదా? నువ్వు న్యాయంకోసం ప్రాకులాడనంతవరకు అంతా సాఫీగానే జరుగుతుంది. న్యాయంకోసం ప్రాకులాడటం అంటే సమస్యలను ఆహ్వానించడమే.
ప్రశ్నకర్త : కాని దాదా! కాలం ఎలావుందంటే మనం ఎవరికైనా మంచి చేయాలని ప్రయత్నించినా, తిరిగి వారు మనల్ని బాధపెడ్తారు.
దాదాశ్రీ : ఎవరికైనా మేలు చేయటం వారు తిరిగి మనకు కీడు చేయటం దాని పేరే న్యాయం. వారితో ఏమీ చెప్పకూడదు. నువ్వు ఏమైనా అంటే వాళు • మనసులో నిన్ను సిగ్గుమాలిన వాడిగా భావిస్తారు.
ప్రశ్నకర్త : ఇతరుల పట్ల ఎంత నిజాయితీగా వ్యవహరించినప్పటికీ, వారు మనల్ని బాధిస్తుంటారు.
దాదాత్రీ : వాళ్ళు నిన్ను బాధించటం కూడ న్యాయమే.