________________
జరిగింది న్యాజీరి
ప్రాంతాలలో అతివృష్టి కొన్ని ప్రాంతాలలో అనావృష్టి. ప్రకృతి అన్నింటినీ నిర్దిష్టంగా ఉంచుతుంది. అది పక్షపాత రహితము. నిష్పక్షపాతమైన న్యాయాన్నే ప్రకృతి ప్రసాదిస్తుంది.
ఈ విషయాలన్నీ ప్రకృతి సిద్ధాంతాల పైన ఆధారపడివున్నాయి. బుద్ధిని నిర్మూలించటానికి ఇది ఒక్కటే నియమం. ఏమి జరిగినా అదే న్యాయం అని నీవు అంగీకరిస్తే బుద్ధి అంతరించిపోతుంది. బుద్ధి ఎంతవరకు జీవించి ఉ ంటుంది? ప్రతి విషయంలో న్యాయాన్ని వెదుకుతున్నంతవరకు బుద్ధి జీవించే వుంటుంది. దానికి (బుద్ధికి) మనం ప్రాధాన్యం యివ్వకపోతే, ఇక దాని ఆటలు సాగవని గ్రహించి మకాం ఎత్తేస్తుంది.
న్యాయానికై వెతకవద్దు. ప్రశ్నకర్త : బుద్ధిని తొలగించే తీరాలి, ఎందువల్లనంటే దానివల్ల నాకు చాలా బాధలు కల్గుతున్నాయి.
దాదాశ్రీ : బుద్దిని తొలగించుకోవటం అంత తేలిక కాదు. బుద్ది కార్యరూపి; దాని కారణాలను తొలగిస్తే కార్యం తొలగిపోతుంది. దాని కారణాలు ఏమిటి? వాస్తవంలో ఏమి జరుగుతుందో అదే న్యాయమని మనం చెప్పాలి. అపుడు బుద్ధి తొలగిపోతుంది. ప్రపంచం ఏమి చెప్తుంది? వాస్తవంలో ఏమి జరిగితే దానిని స్వీకరించటం (అంగీకరించటం) నేర్చుకోవాలి. న్యాయాన్ని
వెదికే కొద్దీ విభేదాలు, జగడాలు పెరుగుతూ ఉంటాయి. బుద్ధి అంత తేలికగా పోదు.
దానిని వదిలించుకోవటానికి మార్గం ఏమిటి? బుద్ధి చెప్పేదానిని మనం స్వీకరించకుండా ఉంటే అది తొలగిపోతుంది.
ప్రశ్నకర్త : బుద్దిని తొలగించుకోవాలంటే దాని కారణాలను తెలుసుకోవాలి అని మీరు చెప్పారు.
దాదాశ్రీ : బుద్ధికి కారణం మనం న్యాయంకోసం ప్రాకులాడటమే. మనం న్యాయం కోసం ప్రాకులాడటం మానేస్తే బుద్ది తొలగిపోతుంది. న్యాయం కోసం వెదకటం దేనికి? న్యాయం కోసం ఎందుకు వెదుకుతున్నావని ఒకామెను అడిగినప్పుడు, ఆమె “మా అత్తగారు ఎలాంటిదో మీకు తెలియదు. ఈ ఇంటికి