________________
జరిగింద న్యాజీురి
నా
(లౌకిక) న్యాయానికి భిన్నంగా ఉంటుందని చెప్తాను. ప్రకృతి న్యాయమే న్యాయం. ఈ న్యాయం ప్రపంచం యొక్క “రెగ్యులేటర్” అందువల్ల అది ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ప్రకృతి న్యాయంలో ఒక్క క్షణ కాలం కూడ అన్యాయం జరగదు. అయినా ప్రజలు దానిని ఎందుకు అన్యాయంగా భావించి స్వంతన్యాయం కోసం వెదుకుతారు? కారణం ఏమంటే వాళ్ళకి ఏది లభించిందో అదే న్యాయం అని వారికి తెలియదు. నీకు రెండు ఎకరాలు ఎంద్కు యివ్వలేదు. 5 ఎకరాలు ఎంద్కు యిచ్చాడు? అతను ఏమి ఇచ్చాడో అదే న్యాయం. ఇపుడు జరిగిందంతా గత జన్మ తాలూకా ఖాతాతో ముడిపడివుంది. గత జన్మలో లావాదేవీలు ఇపుడు బాలెన్స్ అయ్యాయి. దానికై వ్యాకులపడితే అది కూడా ఖాతా ప్రకారమే. న్యాయం అంటే ధర్మా మీటరు. ఆ ధర్మామీటరు ద్వారా చూస్తే నేను క్రిందటి జన్మలో అన్యాయం చేసాను అందుకే యిపుడు నాకు ఈ అన్యాయం జరిగింది అని తెలుస్తుంది. ఆ దోషం ధర్మామీటరుది కాదు. నీకెలా అన్పిస్తుంది? నా ఈ మాటలు నీకు ఉపయోగకరంగా ఉన్నాయా?
ప్రశ్నకర్త : అవును. చాలా ఉపయోగపడ్తాయి.
దాదాశ్రీ : ప్రపంచంలో న్యాయంకోసం ప్రాకులాడవద్దు. ఏమి జరుగుతుందో అదే న్యాయం. ఏమి జరుగుతూ వుందో దానిని చూస్తూఉండాలి. అంతే. అన్నగారు తమ్ముడికి ఏభై ఎకరాలకు బదులు ఐదు ఎకరాలు ఇచ్చి తమ్ముడిని “సరిపోయిందా”? నీకు సంతోషంగా ఉందా?" అని అడిగినపుడు తనకు సంతోషంగా ఉందని సమాధానం చెప్తాడు. తర్వాత మర్నాడు ఇద్దరు కలసి భోజనం చేస్తారు. ఇదంతా లెక్క ప్రకారమే జరుగుతుంది. ఆ పరిధిని దాటి ఏమీ జరగదు. తండ్రి అయినా సరే కొడుకునుంచి వసూలు చేయాల్సింది చేయకుండా వదిలిపెట్టడు. ఇదంతా రక్తసంబంధం, బంధుత్వాలూ కాదు. కేవలం బాలెన్స్ ఆఫ్ అకౌంట్స్. మనం రక్త సంబంధం అని భ్రమపడ్తాం.
16
వేరొకరి నిర్లక్ష్యం వల్ల చంపబడితే అదీ న్యాయమే.
ఒక వ్యక్తి బస్కోసం ఎదురుచూస్తూ సరైన స్థలంలోనే నిలబడ్డాడు. ఇంతలో ఒక బస్ రాంగ్సైడ్ నుంచి వచ్చి అతని మీదుగా వెళ్లి అతనిని చంపేసింది. ఇది న్యాయం ఎలా అన్పించుకుంటుంది?