________________
జరిగింది న్యాజీరి
దాదాశ్రీ : అవును. ఆ విధంగా చెప్పటం వల్ల ఎదుటివ్యక్తికి మేలు కల్గుతుంది. అన్నింటికంటె ఉత్తమం ఏమంటే అసలు ఏమీ చెప్పకుండా ఉ ండటం. దానికంటె మంచి పని ఇంకొకటి లేదు. ఎవరైతే విముక్తి పొందాలనుకొంటారో వారు ఏ చిన్న ఫిర్యాదు కూడ చేయకూడదు.
ప్రశ్నకర్త : సలహా రూపంలో కూడ చెప్పకూడదా? మౌనంగా వుండి పోవాలా?
దాదాత్రీ : వాళ్ళు తమతో పాటు తమ స్వంత ఖాతాను తెచ్చుకున్నారు. దానితోపాటు తమ తెలివితేటల్ని కూడ తెచ్చుకున్నారు. నేను చెప్పేది ఏమంటే సంసారం నుంచి విముక్తి పొందదల్చుకొంటే మౌనమే మార్గం. రాత్రి పారిపోదల్చు కొంటే ఆ సమయంలో నువ్వు పెద్దగా అరిస్తే, నీవు పట్టుబడిపోతావు కదా.
భగవంతుని స్థానం ఏమిటి? భగవంతుడు న్యాయ స్వరూపుడు కాదు, అన్యాయ స్వరూపుడు కూడ కాదు. ఏ ప్రాణికీ కూడ దు:ఖం కళాకూడదు అనేదే భగవంతుని భాష. న్యాయా న్యాయాలు మానవపరిభాషలోనివి.
దొంగ దొంగతనాన్ని ధర్మంగా భావిస్తాడు. దాత దానం చేయటం ధర్మంగా భావిస్తాడు. ఇది లోక భాష, భగవంతుని భాష కాదు. ఇటువంటివి ఏమీ భగవంతుని వద్ద లేవు. దైవ లోకంలో ఉన్నది ఇంతమాత్రమే “ఏ జీవికీ దు:ఖాన్ని కల్గించకూడదు. ఇదే మా ఆజ్ఞ”.
న్యాయాన్యాయాలు నిర్ణయించేది ప్రకృతి. ప్రపంచంలో మానవులచే నిర్ణయించబడే న్యాయాన్యాయాలు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. దోషిని స్వేచ్ఛగా విడుదల చేయవచ్చు. నిర్దోషిని శిక్షించవచ్చు. కాని ప్రకృతి న్యాయాన్ని ఎవరూ తప్పించుకోలేరు. దానిని ఎవరూ ప్రభావితం చేయలేరు. మనలోని దోషాలే ప్రవంచాన్ని మనకి అన్యాయంగా చూపిస్తాయి.
కేవలం మనలోని దోషాల కారణంగానే మనకు ప్రపంచం అంతా అన్యాయంగా కన్పిస్తుంది. కాని అన్యాయం అణుమాత్రం కూడ జరగదు. పూర్తిగా న్యాయమే జరుగుతుంది. న్యాయస్థానాల్లోని న్యాయంలో తేడాలు ఉ