________________
జరిగింది న్యాజీరి
దాదాత్రీ : ప్రకృతి దోషులనే శిక్షిస్తుంది గాని వేరే ఎవరినీ కాదు. జరిగే వినాశంలో దోషులే పట్టుబడతారు. ఈ ప్రపంచంలో ఎపుడూ ప్రకృతి న్యాయం కించిత్ మాత్రం కూడ డిస్టర్బ్ కాదు. ప్రకృతి ఒక సెకను కూడ న్యాయాన్ని అధిగమించదు.
పాములు, దొంగలూ ప్రపంచంలో అవసరమా?
ప్రపంచంలో దొంగలు, జేబు దొంగతనాలు వీటి అవసరం ఉందా అని ప్రజలు నన్ను అడుగుతుంటారు. అందుకే భగవంతుడు వారికి జన్మను ప్రసాదించి ఉంటాడు. వాళ్ళు లేకపోతే ప్రజల జేబులు ఎవరు ఖాళీ చేస్తారు.? ఆపని చేయటానికి భగవంతుడే స్వయంగా వస్తాడా? ప్రజలు అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని, నల్లధనాన్ని ఎవరు తీసికొని వెళ్ళాలి? ఆ దొంగలు నిమిత్త మాత్రులు. వారు అవసరమే.
ప్రశ్నకర్త : ఒకొక్కరి కష్టార్జితమైన ధనం కూడ దొంగిలించబడుంది
కదా!
దాదాశ్రీ : ఈ జన్మలో ఆ ధనం కష్టార్జితమే, కాని గత జన్మ ఖాతా కూడ ఉంటుంది కదా! అతని పెండింగ్ ఖాతాలు ఉండి ఉంటాయి. అటువంటి ఖాతాలు లేకుండా అతని సొమ్మును ఎవరూ తీసికొని పోలేరు. అలా తీసికొని వెళ్ళే శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తీసికొని వెళ్తే అది అతని పూర్వపు ఖాతా ప్రకారమే. ఎవరికైనా హాని చేయగల సమర్ధత ఉన్న వ్యక్తి ఎవరూ ఈ ప్రపంచంలో పుట్టలేదు. ప్రకృతి దానిని చాలా బాగా నియంత్రిస్తుంది. అంతా నియమ బద్ధంగా జరుగుతుంది ప్రపంచంలో. మైదానాన్ని మొత్తం పాములతో నింపినా సరే ఒక పాము కూడ నిన్ను తాకదు నీ పూర్వపు ఖాతాలో లేకుంటే. ప్రపంచం అంతా లెక్క ప్రకారమే, నియమబద్దంగానే వుంటుంది. ప్రపంచం చాల సుందరమైనది. అది న్యాయ స్వరూపం. ప్రజలు దానిని గ్రహించలేరు.
పరిణామాన్ని బట్టి కారణాన్ని నిర్ణయించవచ్చు. ఇదంతా పరిణామమే, పరీక్షా ఫలితాలను పోలినదే. మీకు గణితంలో