________________
11
బాధపడేవానిదే తప్పు
భారత - పాకిస్థాన్ యుద్ధసమయంలో ప్రజలు బాంబులు పడతాయేమోనని భీతిచెందారు. అటువంటి భయాలు బుద్ధికారణంగానే కలుగుతాయి. ఈ ప్రాపంచిక జీవితానికి కారణం బుద్ధి. దుర్వార్తలు విన్న సమయంలో కూడా జ్ఞానం మీకు ప్రశాంతతని, సమాధానాన్ని కల్గిస్తుంది. నీ చుట్టు ప్రక్కల జరుగుచున్న ప్రతి విషయానికి నీవు 'జ్ఞాత' మరియు 'ద్రష్ట'గా మాత్రమే వుండాలి. ఏదీ నిన్ను ప్రభావితం చేయకూడదు.
నీవు కేవలం తెల్సుకోవాలి మరియు చూడాలి అంతే. వార్తలు వివరాలతో సహా తెలుసు కోవటాన్ని తెల్సుకోవడమంటారు. విస్తృత వివరణ లేకుండా కేవలం హెడ్ లైన్స్ మాత్రమే చూస్తే దానిని చూడటం అంటారు. ఎవరినీ దోషులుగా భావించరాదు.
ప్రశ్నకర్త : ఇవి ప్రస్తుత కాలచక్రం యొక్క దోషాలా?
దాదాశ్రీ : కాలాన్ని మాత్రం ఎందుకు నిందించాలి? ఆ తప్పు బాధపడే వానిదే. కాలం సదా పరివర్తన చెందుతూనే వుంటుంది. మంచి కాలంలో మాత్రం మనం లేకుంటిమా ? ఇరువది నాల్గుమంది తీర్థంకరుల కాలంలో మనం లేకుంటిమా?
ప్రశ్నకర్త : మనం ఉన్నాం. దాదాశ్రీ : ఆ సమయంలో మనం ప్రాపంచిక సుఖాలలో మునిగిపోయాం. దానితో కాలానికి ప్రమేయం ఏమిటి ? కాలం దానంతట అదే సాగిపోతుంటుంది. నువ్వు పగటిపూట ఏపనీ చేయకపోయినంతమాత్రాన,
రాత్రిరాకుండా ఉంటుందా ?
ప్రశ్నకర్త :
రాత్రి అవుతుంది. దాదాశ్రీ : నీవు రెట్టింపు ధర చెల్లించటానికి యిష్టపడినప్పటికీ,
రాత్రి 2 గంటల వేళ ఎవరైనా నీకు బరాణీలు అమ్మటానికి సిద్ధపడతారా ?
ప్రజల దృష్టిలో ఇది అన్యాయము ఒక వ్యక్తి మోటారు బైక్ పై రోడ్డుకి రాంగ్ సైడులో వెళ్తూ ఒక సైక్లిస్టుని గుద్దుతాడు. ఆ సైక్లిస్టు కాలు విరుగుతుంది. ఇపుడు బాధపడేది ఎవరు ?
ప్రశ్నకర్త : సైక్లిస్టు.