________________
బాధపడేవానిదే తప్పు
ఇతరులలో దోషాలను చూడటం చాలా తప్పు. నీకు బాధను కలుగచేసే నిమిత్తుణ్ణి ఎదుర్కోవటం నీ తప్పు. నిమిత్ ఒక వ్యక్తి అయితే నీవతనిని నిందిస్తావు. కాని నిమిత్ ఒక ముల్లు అయితే అది నీకు గుచ్చుకొంటే నీవేమి చేస్తావు ? వందలకొద్దీ ప్రజలు ఆ మార్గంలో నడుస్తారు. కాని వారిలో ఎవరికీ ఆ ముల్లు గుచ్చుకోకుండా చందూభాయ్ పాదంలో గుచ్చుకొంది. వ్యవస్థిత్ చాలా ఖచ్చితమైనది. ఎవరికి పూర్వపుఖాతాలున్నాయో వారికే అది బాధను కల్గిస్తుంది. నిమిత్ని (సాధనాన్ని) మరియు బాధపడవలసిన వ్యక్తితో సహా మిగిలిన పరిస్థితుల నన్నింటినీ వ్యవస్థిత్ ఒక్కచోట చేరుస్తుంది. కాని నిమిత్ (ముల్లు) దోషం ఏమిటి ?
21
ఒక వ్యక్తి మనపై మిరియాల పొడివంటి ఘాటైన స్ప్రే చేస్తే మనకి దగ్గు వస్తుంది. అతనిపై కోపం కూడా వస్తుంది. నిమిత్తుణ్ణి నిందిస్తాము. కాని ఎవరైన ఎండుమిర్చి వేయించుకొంటున్నందువల్ల మనకి దగ్గువస్తే అపుడు కోపం వస్తుందా? కర్త ఎవరు? అన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి అనే సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, దాని గురించి మనం పోట్లాటకు దిగుతామా? బాణం వేసిన విలుకానిది తప్పు కాదు. ఎవరు ఆ బాణం వల్ల గాయపడ్డారో వారిది తప్పు. విలుకాడు తన కర్మకి ఫలాన్ని అనుభవించేటపుడు దోషిగా పరిగణింపబడతాడు. ఈ క్షణంలో ఏ వ్యక్తి బాణం వల్ల గాయపడ్డాడో అతడు తన దోషానికి పట్టుబడ్డాడు. అనగా అతని పూర్వకర్మ అతనిని ఈ బాణం రూపంలో పట్టుకొని శిక్షించింది. పట్టుబడిన వ్యక్తే ప్రథమ దోషి. విలుకాడు తన కర్మఫలాన్ని అనుభవించేటపుడు దోషిగా పరిగణింపబడతాడు.
ప్రజలు సదా పిల్లలను నిందిస్తారు.
దాదాశ్రీ : నీవు స్కూలులో చదివే సమయంలో ఏమైనా కష్టాలు అనుభవించవలసి వచ్చిందా ?
ప్రశ్నకర్త : అవును.
దాదాశ్రీ : నీ తప్పుల కారణంగానే నీవు బాధపడ్డావు. టీచర్ని గాని మరెవరినిగాని
నిందించరాదు.