________________
జరిగింద న్యాజీురి
ఫలితం లభించేటపుడు న్యాయం కావాలంటే ఎలా? దానికై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏమి లాభం? నీకు లభించినది ఏదైనా దానికి నీవే బాధ్యుడవు. ఒక సంఖ్యను వేరొక అంకెతో గుణించామనుకోండి. మరల తిరిగి మొదటి సంఖ్యను పొందాలంటే గుణించగా వచ్చిన సంఖ్యను ఏ అంకెతో అయితే గుణించామో దానితోనే భాగించాలి కదా! అపుడే మొదటి సంఖ్య లభిస్తుంది. నేను చెప్పినది అర్ధం చేసికోగలిగితే ఏ విషయమైనా ఎలా ఏర్పడిందో అలాగే విడిపోతుందని గ్రహిస్తావు.
4
ప్రశ్నకర్త : అవును. మీ మాటలు ఏ వ్యక్తినైనా క్లిష్ట సమయంలో సమాధానపరుస్తాయి. ఆ వ్యక్తి ఆ మాటలను అర్ధంచేసికోగలిగితే అతని పని పూర్తి అయినట్లే.
దాదాశ్రీ : అవును. అతను తన వ్యక్తిగత ప్రయోజనంకోసం అతి తెలివిని ప్రదర్శించనంతకాలం అతని పని సజావుగా సాగుతుంది.
ప్రశ్నకర్త : నేను నిత్య జీవితంలో “జరిగిందే న్యాయం”, “బాధపడే వానిదే తప్పు”. ఈ రెండు సూత్రాలను అన్వయించుకొంటున్నాను.
:
దాదాశ్రీ : న్యాయం కోసం వెదకవద్దు. దీనిని జీవితంలో అమలు పరచగలిగితే ఏ ఉద్వేగాలూ ఉండవు. న్యాయంకోసం అన్వేషించటంవల్లనే సమస్యలు తలెత్తుతాయి.
హంతకుడు అతను గత జన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలంగా నిర్దోషిగా బయటపడవచ్చు.
ప్రశ్నకర్త :ఒక వ్యక్తి ఎవరినైనా హత్యచేస్తే అది న్యాయమనిపించు కొంటుందా? దాదాశ్రీ : న్యాయానికి భిన్నంగా ఏమీ జరగదు. భగవంతుని పరిభాషలో అది న్యాయమే కాని అది మానవుల పరిభాషలో న్యాయంకాదు, చట్ట పరిధిలోనూ అది న్యాయం కాదు. చట్టపరిధిలో హత్యచేసిన వ్యక్తి దోషిగానే పరిగణింపబడతాడు. కాని భగవంతుని భాషలో హత్యచేయబడిన వాడే దోషి హత్యచేసిన వ్యక్తి అతని పాపకర్మ పరిపాకం అయినపుడు పట్టుబడతాడు. అపుడే అతడు దోషిగా లెక్కింపబడతాడు.
ప్రశ్నకర్త : ఒక హంతకుడు కోర్టులో నిర్దోషిగా పరిగణింపబడి విడుదల