________________
జరిగింది న్యాజురి
13
మంచివారు కూడ ఎందుకు కష్టాల పాలవుతుంటారు అని కొంతమంది అడుగుతారు. వాస్తవానికి ఎవరూ వారి కష్టాలకు కారణం కాదు. ఏ విషయంలోనూ మనం జోక్యం చేసికోనంత వరకు ఎవరూ మన విషయంలో జోక్యం చేసికోరు. అటువంటి శక్తి ఎవరికీ లేదు. మన జోక్యం వల్లనే సమస్యలు అన్నీ తలెత్తుతున్నాయి.
ప్రాక్టికల్ గా ఉండాలి. “జరిగిందే న్యాయం” అని శాస్త్రకారులు చెప్పరు. వారు లౌకిక న్యాయాన్ని మాత్రమే న్యాయంగా పేర్కొంటారు. న్యాయస్థానం చెప్పిన న్యాయమే న్యాయం శాస్త్రకారుల దృష్టిలో. ఇది ధియొరెటికల్ మాత్రమే ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే “ఏది జరిగితే అదే న్యాయం”. ప్రాక్టికల్ కాకుండా ఈ ప్రపంచంలో ఏ పనీ జరగదు. కేవలం థియరీ వల్ల ప్రయోజనం లేదు. “ఏది జరిగితే అదే న్యాయం” అన్న దానిని తెలుసుకొన్నందువల్ల ప్రయోజనం లేదు, దానిని నిజజీవితంలో అన్వయించుకోవాలి.
అందువల్లనే జరిగింది ఏదైనా న్యాయమే. నిర్వకల్పస్థితిలో వుండాలంటే ఏది జరిగితే దానిని స్వీకరించాలి. అంటే భగవంతునిగా నువ్వు ఉండాలంటే “జరిగిందే న్యాయం”, లేదు లక్ష్యరహితంగా తిరగాలనుకుంటే న్యాయంకోసం వెదుకు.
లోఖని బాథించే నష్యాలు. ఈ జగత్తు మిధ్య కాదు. జగత్తు న్యాయ స్వరూపం. ప్రకృతి ఎప్పుడూ అన్యాయాన్ని జరగనివ్వదు. ప్రకృతి కారణంగా మనుషులు చనిపోయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా అది అంతా న్యాయమే. ప్రకృతి ఎప్పుడూ న్యాయ పరిధిని దాటదు. అజ్ఞాన కారణంగా ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించలేరు. జీవితాన్ని అనుభవించే కళ మనుష్యులకు తెలియదు. అందువల్లనే వారికి జీవితంలో చింత తప్ప మరేమి ఉండదు. జరిగినది ఏమైనా సరే అదే న్యాయం అని స్వీకరించటం నేర్చుకోవాలి.
నువ్వు ఒక దుకాణంలో ఐదు రూపాయల విలువగల వస్తువుకొని దుకాణ దారునికి వందరూపాయల నోటు యిచ్చావు. కస్టమర్స్ రద్దీవల్ల అతను నీకు ఐదురూపాయలు మాత్రమే యిచ్చి, మిగిలిన తొంభై రూపాయలు యివ్వటం