________________
జరిగింది న్యాజీరి
ండవచ్చు. ఎందుకంటే అది సాక్ష్యాలమీద ఆధారపడివుంటుంది. ఆ న్యాయాన్ని తప్పని నిరూపించే అవకాశం కూడ ఉంటుంది. కాని ప్రకృతి న్యాయం స్థిరమైనది దానిలో ఏ తేడా ఉండదు.
ప్రశ్నకర్త : అయితే కోర్టు న్యాయమూ ప్రకృతి న్యాయమూ ఒకటే
కాదా?
దాదాత్రీ : అది అంతా ప్రకృతిదే. కాని కోర్టు తీర్పులో ఈ జడ్జి ఇలా చేశాడు అనే భావన మనకి కల్గుతుంది. కాని ప్రకృతి విషయంలో మనకి అటువంటి భావన కళాదు. ఈ భేదాలను సృష్టించేది బుద్ధి మాత్రమే.
ప్రశ్నకర్త : మీరు ప్రకృతి న్యాయాన్ని కంప్యూటర్ తో పోల్చారు కాని కంప్యూటర్ మెకానికల్ కదా!
దాదాశ్రీ : ప్రకృతి న్యాయాన్ని వివరించటానికి సమానమైన వేరే సాధనం ఏమీ లేదు. అందుకే ఆ విధంగా పోలిక చెప్పాను. కంప్యూటర్ లో డేటా ఎలా ఫీడ్ అవుతుందో అలాగే మన అంతరంగంలోని భావాలు కూడ ఫీడ్ అవుతాయి.
ఈ జీవితకాలంలో ఒక వ్యక్తికి ఏఏ భావాలు అంతరంగంలో కల్గుతాయో ఆ భావాలు అతని భవిష్య జన్మకి కర్మను సృష్టిస్తాయి. దీనిని విత్తనాలు నాటడంతో కూడ పోల్చవచ్చు. అనగా ఈ జన్మలో అతను విత్తనాలు నాటుతున్నాడు అవి అతనికి వచ్చే జన్మలో ఫలాలను అందిస్తాయి. అతని అనుభవంలోకి వస్తాయి. అందువల్ల ఒక వ్యక్తికి ఈ జన్మలో కలిగే అనుభవాలు అన్నీ అతని గత జన్మ కర్మఫలాలు, అనగా గత జన్మకర్మల విసర్జన. ఈ విసర్జన వ్యవస్థిత్ (విధి) అధీనంలో వుంటుంది. అది ఎపుడూ న్యాయమే చేస్తుంది. ప్రకృతి న్యాయాన్ని వ్యవస్థిత్ (విధి) అమలు చేస్తుంది. ఒక తండ్రి తన కొడుకును చంపితే అది ప్రకృతి న్యాయమే. ఆ తండ్రి, కొడుకుల మధ్య గత ఖాతాలు ఏమి ఉన్నాయో అవిపూర్తి అవుతున్నాయి. ఆ అప్పు ఈ జన్మలో తిరిగి చెల్లించబడిందన్నమాట.
ఒక పేదవాడు లాటరీలో ఒక లక్ష రూపాయలు గెల్చుకున్నాడనుకోండి. అదీ న్యాయమే. ఎవరి జేబు అయినా కత్తిరించబడితే అది న్యాయమే.